ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. బోరివాలి ప్రాంతంలో ఈరోజు నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. సాయిబాబా నగర్ లో గీతాంజలి అపార్ట్మెంట్ పేరుతో ఉన్న ఈ భవనం అందరూ చూస్తుండగా మధ్నాహ్నం 12.34 గంటల ప్రాంతంలో కూలిపోయింది. భవనం అకస్మాత్తుగా కూలుతున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. అక్కడున్న వారంతా దానిని చూసి భయపడిపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఎనిమిది ఫైర్ ఇంజన్లు, అగ్నిమాపక దళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇప్పటికే అందులోని నివాసితులను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు.
https://twitter.com/HTMumbai/status/1560574850191994881?s=20&t=KVuKUkDqp_vS3SRKtovGcA