పాతికేళ్ల వయసుకే న్యాయమూర్తి అయ్యారు ఓ యువతి. పేదరికంలో పుట్టినా కష్టపడి చదివిన గాయత్రి కర్నాటకలోని కోలారు సివిల్ కోర్టు న్యాయమూర్తి అయ్యారు.సమీప బంగారపేట తాలూకా యళబుర్గికి చెందిన గాయత్రి….ప్రభుత్వ పాఠశాలలో చదివారు. కేజీఎఫ్ లోని కెంగల్ హన్మంతయ్య కాలేజీలో లా చేసి…యూనివర్సిటీ స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించారు. సివిల్ న్యాయమూర్తి పోస్టులకు నిర్వహించిన ముఖాముఖిలో సత్తాచాటారు.తల్లిదండ్రులకు గాయత్రి ఒక్కరే కుమార్తె. కూలిపనులకు వెళ్లి బిడ్డను పోషించుకున్నారు.