పార్లమెంట్ భవన నిర్మాణం వినియోగంలోకి వచ్చి నేటికి 96 ఏళ్లు పూర్తయ్యాయి. స్వాతంత్ర్య భారతావని ఆవిర్భావం, నూతన రాజ్యాంగ రూపకల్పన, ఎన్నో చర్చలు, చట్టాలు, వాదప్రతివాదాలు ఇలా ఎన్నో ఘట్టాలకు ఈ కట్టడం వేదికగా నిలిచింది.1927 జనవరి 18న నాటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఈ భవనాన్ని ప్రారంభించారు. బ్రిటీష్ పాలకులు తమ రాజధానిని కలకత్తానుంచి ఢిల్లీకి మారుస్తూ రైసినా హిల్ ప్రాంతంలో 1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన చేశారు. బ్రిటిష్ ఆర్కిటెక్టులు సర్ హెర్బర్డ్ బాకర్,సర్ ఎడ్విన్ లుటియెన్స్ రూపశిల్పులు. ఇప్పుడున్న పార్లమెంట్ ప్రాంగణంలోనే కొత్త సముదాయాన్ని నిర్మిస్తున్నారు. అది అందుబాటులోకి వచ్చాక పాత భవనం చరిత్రగా మిగిలిపోనుంది.