
file photo
2022లో కశ్మీర్లో 93 కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ జరిగాయని, 172 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని పోలీసులు తెలిపారు. వీరిలో అత్యధికులు లష్కరే తొయిబా, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందినవారు. 2022 ముగింపురోజు సందర్భంగా కశ్మీర్ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి ఇళ్ల యజమానులు నిరాకరించడం మంచి పరిణామమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉగ్రవాద సంస్థల్లో చేరడాన్ని గర్వకారణంగా భావించడం మానేశారనీ… ఇప్పటికే ఉగ్రవాదంలో చేరినవారిని తిరిగి రావాలని కోరుతున్నారన్నారు.
2022లో ఉగ్రవాదంలో చేరినవారిలో దాదాపు 89 శాతం మంది మొదటి నెలలోనే హతులయ్యారు. 2022లో 100 మంది కొత్తగా ఉగ్రవాదంలో చేరారని, అంతకుముందు సంవత్సరం కన్నా ఇది 37 శాతం తక్కువ అని డీజీపీ వివరించారు. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థలో 74 మంది చేరారని తెలిపారు. 17 మందిని అరెస్టు చేయగా, 65 మంది హతమయ్యారని, 18 మంది ఇంకా క్రియాశీలంగా ఉన్నారని చెప్పారు. 2022లో కశ్మీరులో 93 కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ జరిగాయని, 172 మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. వీరిలో అత్యధికులు లష్కరే తొయిబా, దాని స్థానిక అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్కు చెందినవారేనని తెలిపారు. హతులైనవారిలో జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, అల్-బదర్, అల్ఖైదా అనుబంధ సంస్థ అన్సర్ ఘజ్వాత్-ఉల్-హింద్ ఉగ్రవాద సంస్థలకు చెందినవారు కూడా ఉన్నారని తెలిపారు.
https://twitter.com/ANI/status/1609076597331746816?s=20&t=qdf3m66k3pb0QGfTGCopjQ