13 ఏళ్ల బాలికను 8 నెలలకు పైగా వ్యభిచార వృత్తిలోకి నెట్టి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వేర్వేరు వ్యభిచార గృహాలకు పంపి, 80 మంది పురుషులు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో పోలీసులు మంగళవారం మరో 10 మందిని అరెస్టు చేశారు. వార్తా కథనాల ప్రకారం, మొత్తం అరెస్టయిన వారి సంఖ్య 74 కి చేరుకుంది. గుంటూరులో ఆమెను పోలీసులు రక్షించారు.
గత ఏడాది జూన్లో కోవిడ్ -19 ఆసుపత్రిలో తన తల్లితో స్నేహం చేసిన ఒక మహిళ ఆ మైనర్ను దత్తత తీసుకుంది. కోవిడ్ కారణంగా బాలిక తల్లి చనిపోవడంతో, తండ్రికి తెలియకుండా.. బాలికను చూసుకుంటాననే సాకుతో ప్రధాన నిందితురాలు స్వర్ణ కుమారి ఆమెను తీసుకెళ్లింది. అప్పుడే ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి దింపింది.
ఆగస్ట్ 2021లో, బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో, పోలీసులు చర్య తీసుకుని బాలికను కనిపెట్టారు. ఈ కేసులో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. జనవరిలో మొదటి అరెస్టు జరిగింది. మళ్ళీ ఏప్రిల్ 19న గుంటూరు వెస్ట్ జోన్ పోలీసులు B.Tech విద్యార్థితో సహా మరో 10 మందిని అరెస్టు చేశారు. అక్కడే పోలీసులు ఆ మైనర్ ను రక్షించారు.
“అమ్మాయి వయస్సు, పరిస్థితిని ఉపయోగించుకుని అనేక ముఠాలు అమ్మాయిని కొనుగోలు చేసి, ఆమెను తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు తీసుకెళ్లి వ్యభిచారంలోకి నెట్టేశారు” అని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె.సుప్రజ మీడియాతో వెల్లడించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)