దేశంలో మరో 8 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఓ ప్రకటనలో పేర్కొంది. దేశ వ్యతిరేక, తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నందున ఈ ఛానళ్లను నిషేధించినట్టు కేంద్రం పేర్కొంది. బ్లాక్ చేసిన ఛానళ్లలో ఒకటి పాకిస్థాన్, ఏడు భారత్కు చెందినవి. అలాగే దేశ వ్యతిరేఖ కంటెంట్ ప్రసారం చేస్తోన్న ఓ ఫేస్బుక్ ఖాతాను ఐటీ రూల్స్ 2021 ప్రకారం నిషేధించినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్రం నిషేదించిన 8 యూట్యూబ్ ఛానల్స్ కు దాదాపు 86 లక్షల మంది సబ్స్క్రైబర్లు, 114 కోట్లకుపైగా వ్యూస్ ఉన్నాయి. ఈ ఛానల్స్ భారతదేశంలోని మత వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.