గూగుల్ కు సంబంధించిన భాషా-అనువాద సాధనమైన గూగుల్ ట్రాన్స్లేట్ మరో 24 భాషలను చేర్చింది.
అందులో సంస్కృతం సహా కొత్తగా ఎనిమిది భారతీయ భాషలను యాడ్ చేసింది. వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ గూగుల్ I/O 2022లో ఈ ప్రకటన చేసింది. దీంతో గూగుల్ ట్రాన్స్లేట్ ఇక 133 భాషలకు సపోర్ట్ చేయనుంది. కొత్తగా జోడించిన భాషలను ప్రపంచవ్యాప్తంగా 30కోట్ల మంది మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మిజో భాషను భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లో 8లక్షల మంది మాట్లాడుతున్నారు.గూగుల్ జోడించిన భారతీయ భాషలలో సంస్కృతం తోపాటు అసామీ, డోగ్రీ, కొంకణి, మైథిలి, మిజో, మణిపురి, భోజ్పురిలు ఉన్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ భాషలు జత అవుతాయి. దీంతో ఈ ప్లాట్ఫామ్లోని భారతీయ భాషల సంఖ్య 19కి చేరింది.