కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళలోనే అత్యధికంగా 68.11 కేసులుంటున్నాయి. దేశవ్యాప్తంగా 46 వేల 164 కోవిడ్ పాజిటివ్ నిర్థారణ కాగా… 31 వేల 445 మంది కేరళకు చెందినవారే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రముఖ జర్నలిస్ట్ షెహజాద్ ఓ ట్వీట్ చేశారు.
కేరళలో 31 వేలకు పైగా కేసులు నమోదైనా ఎవరూ పట్టించుకోవడం లేదని…కనీసం ఏ మీడియా ప్రస్తావించడం లేదని… కానీ యూపీలో 24 గంటల్లో 19 కేసులు నమోదైతే మాత్రం హంగామా చేస్తున్నారని అన్నారు. కుంభమేళా, కన్వర్ యాత్రల వల్లే కరోనా సోకిందని …యూపీ సీఎం యోగీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వాళ్లంతా ఎక్కడున్నారని నిలదీస్తూ ట్వీట్ చేశారు షెహజాద్. యూపీలో 23-24 కోట్ల జనాభా ఉంటే కేరళలో మూడున్నరకోట్ల జనాభా ఉందని ట్విట్టర్ ద్వారా గుర్తుచేశారు. కేరళలో “సెక్యులర్ కరోనా వైరస్” ఉండడం వల్లే లుటియన్స్ దానిగురించి మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు.
ఇటీవలి బక్రీద్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాతే కేరళలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది..