కేరళ సరిహద్దు, సముద్ర తీర ప్రాంతం అయిన కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కేంద్రం మంగళూరులో అక్రమంగా నివసిస్తున్న 518మంది విదేశీయులను కర్నాటక పోలీసులు గుర్తించారు. వారంతా వివిధ దేశాలనుంచి విద్యకోసం, విజిటింగ్ వీసాలపై వచ్చినవాళ్లు. కానీ ఇక్కడే స్థిరపడిపోయారు. వారిదగ్గర సరైన ధ్రువపత్రాలు కూడా లేవు. మంగళూరు పరిధిలో 18 పోలీసు స్టేషన్లుండగా…మొత్తం 4 వేల మంది విదేశీయులను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వారిలో 518 మందికి సరైన రికార్డులే లేవు. వారందర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విదేశీయులు ఎక్కువమంది ఉండగా… వారిలో కొందరు ఒడిశా, సిక్కిం, తమిళనాడు, పశ్చిమబెంగాల్ కు చెందిన వాళ్లు కూడా ఉన్నారు.