బడ్జెట్లో హిందువులపై వరాల జల్లు కురిపించింది కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రం నుంచి కాశీకి వెళ్లే భక్తులకు 5 వేల రూపాయల చొప్పున రాయితీ ఇవ్వనున్నట్టు సీఎం బొమ్మై ప్రకటించారు. ఏడాదికి 30వేల మంది భక్తులకు ఈ అవకాశం ఉంటుంది.
అలాగే ఏపీలోని శ్రీశైలం వచ్చే భక్తులకోసం అక్కడ 85 కోట్లతో “యాత్రి నివాస్” కాంప్లెక్స్ను నిర్మించాలని ప్రతిపాదించారు. అందుకు 45 కోట్లు కేటాయించనున్నారు.
సాంస్కృతిక, చారిత్రక, సహజ వనరుల పరిరక్షణకు మొత్తం 3,012 కోట్లు కేటాయించారు. విద్య, ఆరోగ్యం సహా సామాజిక సేవకు సహకరించే మఠాలు, సంస్థలకు సహాయం అందించనుంది ప్రభుత్వం. అర్చకులు, ఆగమ శాస్త్ర పండితులకు, ఎండోమెంట్ దేవాలయాల ఉద్యోగులకు సహాయం చేయడానికి ముజరాయి శాఖ ఆధ్వర్యంలోని ఆలయాల్లో అర్చకులకు గతంలో ఉన్న 48,000 నుంచి 60,000కు పెంచి ఇస్తామని అన్నారు.
ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బొమ్మై పునరుద్ఘాటించారు. హిందువుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని… ఆలయాల అభివృద్ధి పనుల విచక్షణాధికారాన్ని అప్పగించేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)