చండీగఢ్లో జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, రాష్ట్రాల, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల నుంచి సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జీఎస్టీ చట్టంలో రేట్ల మార్పులు, కొత్తగా రావాల్సిన మార్పుల గురించి చర్చించనున్నారు.
న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ గత సమావేశంలో టెక్స్టైల్స్పై రేట్ల మార్పు నిర్ణయాన్ని వాయిదా వేయాలని సిఫారసు చేసింది. వస్త్రాలపై జీఎస్టీ రేటుపై యథాతథ స్థితిని ఐదు శాతానికి కొనసాగించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.