43 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సినేషన్..
అటు భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినట్టే అనిపిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 43 కోట్లమందికి వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యం పెరగుతుండటంతో వ్యాక్సినేషన్ ప్రక్తియ కూడా వేగవంతం అయింది. మరోవైపు దేశంలో గత 24 గంటల్లో 39 వేల కరోనా కేసులు నమోదు కాగా..35 వేలమంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకూ 3 కోట్ల 5 లక్షల 3 వేల 166 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 97.35 శాతంగా ఉంది. నెలరోజుల్నించి దేశంలో 50 వేలకు దిగువలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ప్రస్తుత 4 లక్షల 8 వేల 977 కరోనా యాక్టివ్ కేసులుండగా..కరోనా పాజిటివ్ రేటు 2.40 శాతంగా ఉంది.