బిలియనీర్, టెస్లా వ్యవస్థాపకుడు సోషల్మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ కు భారీ ఆఫర్ ఇచ్చాడు. ఇటీవలే 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన ఆయన ఇప్పుడు ట్విట్టర్ ను పూర్తిగా కొనుగోలు చేస్తానంటూ ముందుకొచ్చాడు. ఏకంగా 41.39 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 3.2 లక్షల కోట్ల రూపాయల్ని నగదుగా చెల్లిస్తానన్నాడు. అంటే ప్రతీ షేర్ కు 54.20 డాలర్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు మస్క్. కంపెనీ సామాజిక ఆవశ్యకతను తాను గుర్తించానని…దాని పరిధిని విస్తరించడం ద్వారా ట్విట్టర్ ను ప్రైవేట్ కంపెనీ ద్వారా మార్చాలని భావించానని అందుకే పూర్తిగా కొనుగోలు చేయాలనుకున్నట్టు ట్విటర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్కు రాసిన లేఖలో తెలిపాడు,
మస్క్ ఈ ప్రకటన తరువాత ట్విట్టర్ షేర్లు బుధవారం 3.10 శాతం వరకు పెరిగి 45.85 డాలర్ల వద్ద ముగియడం విశేషం. అయితే ఇటీవలే ట్విట్టర్ వాటాను కొనుగోలు చేసిన ఎలోన్ మస్క్.. ట్విట్టర్ బోర్డులో చేరాలనే ప్రతిపాదనను కంపెనీ ముందుపెట్టాడు. అయితే అందుకు వారు నిరాకరించారు. ఇంతకన్నా మంచి ఆఫర్ ఉండబోదు. బోర్డ్ అంగీకరించపోతే కంపెనీ వాటాదారుగా నా స్థానం గురించి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని మస్క్ స్పష్టం చేశాడు.
ఎలోన్ మస్క్ 2009లో ట్విట్టర్ లో చేరినప్పటి నుండి 80 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ సంపాదించుకున్నాడు. తన ట్వీట్లతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. పలు కేసుల్నీ ఎదుర్కొన్నాడు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)