రెబల్ శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే సహా ఇతర పార్టీ ఎమ్మెల్యేలు గుజరాత్ లోని సూరత్ హోటల్ నుంచి బుధవారం ఉదయం అస్సాంలో అడుగుపెట్టారు. వారిని బీజేపీ నాయకులు సుశాంత బోర్గోహైన్, పల్లబ్ లోచన్ దాస్ స్వాగతం పలికారు. 40 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉందని షిండే ప్రకటించారు.
“మేం బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేనను విడిచిపెట్టలేదు, దానిని వదలము. మేం బాలాసాహెబ్ బోధించిన హిందుత్వను అనుసరిస్తున్నాం, దానిని మరింత ముందుకు తీసుకువెళతాం” అని ఆయన అన్నారు.
https://twitter.com/ANI/status/1539368917625237504?s=20&t=O8ZbQxaj6hgOpX-3YJe0zQ
https://twitter.com/ANI/status/1539419213663596546?s=20&t=O8ZbQxaj6hgOpX-3YJe0zQ