ఢిల్లీ ప్రమాద ఘటనలో విస్తుగొలిపే విషయాలువెలుగుచూస్తున్నాయి. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ బయటకు వచ్చింది.ప్రమాదంలో చనిపోయిన అంజలి శరీరంపై 40 గాయాలున్నట్టు గుర్తించారు. యువతి శరీరం కారు చక్రాల్లో చీక్కుకుని కిలోమీటర్ల మేర ఊడ్చుకుపోవడంతో వెనకవైపుభాగం పూర్తిగా చిద్రమైంది. తలభాగం పూర్తిగా దెబ్బతింది. వెన్నెముక, కాళ్లకు గాయాలయ్యాయి. వీపు పక్కటెముకలు బయటకు వచ్చాయి. ప్రమాదంతో షాకవ్వడం, తీవ్ర రక్తస్రావం అవడం వల్లే అంజలి మృతి చెందినట్టు వైద్యులంటున్నారు.జనవరి 1న జరిగినఈ ఘటన జరిగింది. స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి కొన్నికిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనమైంది. అయితే సీసీ టీవీ ఆధారంగా మరికొన్ని విషయాలను పోలీసులు గుర్తించారు. ఆ స్కూటీపై అంజలితో పాటు మరో యువతి తిరిగినట్టు గుర్తించారు. కొత్త సంవత్సరం సందర్భంగా కొందరు స్నేహితులతోకలిసి పార్టీ చేసుకున్నామని…తాగి ఉన్న అంజలిని స్కూటీ నడపవద్దని తాను వారించానని..అయినా వినలేదని ఆ అమ్మాయి పోలీసులకు తెలిపింది. కారు ఢీకొట్టి అంజలి పడిపోతే ఒక్కరు కూడా ఆమెను కాపాడేందుకు ముందుకు రాలేదని ఆమె స్నేహితురాలు చెప్పింది.