మొబైల్ యాప్లకు వ్యతిరేకంగా ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో చైనా సహా వివిధ దేశాలు అభివృద్ధి చేసిన 348 యాప్ లను కేంద్రం గుర్తించి బ్లాక్ బ్యాన్ చేసింది. యూజర్ ఇన్ఫర్మేషన్ ను కలెక్ట్ చేసుకొని అనధికారిక పద్ధతిలో విదేశాల సర్వర్లకు అందిస్తోన్నాయన్న ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం పార్లమెంట్ లో తెలిపింది.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MHA) నుంచి అభ్యర్థన ఆధారంగా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ 348 మొబైల్ అప్లికేషన్ లను బ్లాక్ చేసింది. ఎందుకంటే ఇటువంటి డేటా ప్రసారాలు భారతదేశ రక్షణ, భద్రతకు భంగం కలిగిస్తాయని ఎలక్ట్రానిక్స్& ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ యాప్ లను చైనాతో పాటు వివిధ దేశాలు అభివృద్ధి చేశాయని ఆయన తెలిపారు.
పాపులర్ గేమ్ పబ్జీ (PUBG), షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ (TikTok), ఇటీవల బీజీఎంఐ (BGMI) గేమ్ యాప్స్ ఇప్పటికీ నిషేధానికి గురయ్యాయి.