ఆర్టికల్ 370ని ఎత్తివేసిన తరువాత 34 మంది స్థానికేతరులు అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్ సభలో వివరాలు తెలిపారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాచారం ఇచ్చారు. జమ్ము, రియాసీ, ఉదంపూర్, గందర్భల్ జిల్లాలో వాటిని కొనుగోలు చేసినట్టు తెలిపారు. జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి తొలగించిన తరువాత భారతదేశంలోని ఎవరైనా అక్కడ ఆస్తులు కొనుగోలు అవకాశం లభించింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)