అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ది కేరళ స్టోరీ టీజర్ విడుదలైంది. కేరళ నుంచి లవ్ జిహాద్ కు గురైన 32 వేల మంది యువతులు ఉగ్రవాదులుగా మారిన హృదయవిదారక గాథను తెరకెక్కించారు నిర్మాత విపుల్ అమృత్ లాల్. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ఐసిస్ సహా, ఇరాక్, సిరియా ఉగ్రగ్రూపుల్లోకి వారు ఎలా చేరారు అన్నది కథాంశం. అయితే అందరూ మత మార్పిడి బాధితులే. వారిలో చాలామంది లవ్ జిహాద్ లో చిక్కుకున్నవాళ్లే. నటి ఆదాశర్మ ప్రధాన పాత్ర పోషించింది. ‘నేను షాలినీ ఉన్నికృష్ణన్ గా ఉండేదాన్ని.. నర్సు అయ్యి ప్రజలకు సేవ చేయాలనుకున్నా..కానీ బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడి ఫాతిమాను అయ్యాను. ఆ తరువాత ఐసిస్ టెర్రరిస్టుగా మారి…చివరకు ఆఫ్ఘన్లో బందీగా ఉన్నాను’ ఆ పాత్ర పోషించిన ఆదాశర్మ మాట్లాడుతున్నట్టు ఆ టీజర్లో ఉంది. అంతర్జాతీయ సరిహద్దు దగ్గర నిలబడిన ఓ ముస్లిం యువతి తన కథను వివరిస్తున్నట్టు ట్రైలర్లో చూపారు.
కేరళయువతను లక్ష్యంగా చేసుకుని మతం మార్చి 32 వేలమందికి ఉగ్రశిక్షణ ఇచ్చి యెమెన్, సిరియాలకు పంపిన వాస్తవపరిస్థితిని ఇందులో చూపారు. కేరళలో గత కొన్నేళ్లుగా జరుగుతున్నది ఇదే. పీఎఫ్ఐ దాని అనుబంధ ఇస్లామిస్టు సంస్థల కార్యకలాపాలు కేరళలో మాత్రమే కాదు దక్షిణాదిలో ఎలా జడలు విప్పుతుందో అందరికీ తెలుసు.
ఇలాంటికథను తెరకెక్కించడంఅంటే… పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పవచ్చు. దాదాపు నాలుగేళ్లు విస్తృత పరిశోధన చేశారు సుదీప్తోసేన్. అందుకు కొన్ని అరబ్ దేశాలతో పలు ప్రాంతాల్ని సందర్శించారు. ఎందరో బాధితులు, వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు.
2020లో సినిమాను ప్రకటిస్తూ ఈవిషయాలు చెప్పారు విపుల్. “ఇంతటి అమానవీయ పరిస్థితులు మన ఊహకు కూడా అందనివి. సుదీప్తోను కలిసిన మొదటి మీట్ లో ఆయన తన అనుభవాలు చెప్తూ..నాలుగేళ్ల తన పరిశోధన సారాంశాన్ని షేర్ చేస్తుంటే నేను ఆగకుండా ఏడుస్తూనే ఉన్నాను. అందుకే ఆరోజే నిర్ణయించుకున్నా.. ఆ సినిమా నిర్మించాల్సిందేనని.. వాస్తవ ఘటనలను మాత్రమే చిత్రీకరిస్తాం. అబద్దాలు మా అభిమతం కాదు’ అని ఆనాడే స్పష్టం చేశారు దర్శక నిర్మాతలు.
2009 నుంచి కేరళలో ఇస్లామిస్టులు సాగించిన ఆగడాల ప్రస్తావనే ఇందులో ఉంది. 2009 నుండి కేరళ, మంగళూరు ఎక్కువగా మొత్తంగా 32,000 మంది హిందువులు, క్రైస్తవ మహిళలు ఇస్లాంలోకి మారారు. వారిలో చాలామంది ప్రస్తుతం సిరియా, ఆప్ఘనిస్తాన్ సహా పలు ప్రాంతాల్లో ఐసిస్లో ఉన్నారు. కొందరు హక్కానీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నారు. దానివెనక సాగిన కుట్ర, వారి కష్టాలు ఇందులో చూపారు.
మత మార్పిళ్లు 2009లో మొదలైనా…వాళ్లను కుట్ర ప్రకారం ఐసిస్లో చేరుస్తున్నారని 2013లో బయటపడింది. 2014 నాటికి, ISIS కేరళలో బలంగా పాతుకుపోయింది. పెద్దఎత్తున యువతను రిక్రూట్ చేస్తూ ఆప్ఘన్, సిరియాల్లోని తమ దళాల్లోకి పంపింది. ఇక ఇటీవలి కాలంలో అయితే పెద్దసంఖ్యలో యువతులతో పాటు యువకులూ ISKP (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్)లో చేరారు.2020లో ఉగ్రవాద నివేదిక విడుదల చేసిన ఐక్యరాజ్య సమితి భారత్ లోని కేరళనుంచి చేరిన ఉగ్రవాదులే ఐసిస్లో పెద్దసంఖ్యలో ఉన్నారని హెచ్చరించింది.
స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ విల్సన్ హత్యకు సంబంధించి జూలై 2020లో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ..రాష్ట్రంలో ఐసిస్ ఉగ్రకలాపాలు బలంగా ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం కేరళలో ఐఎస్ రిక్రూట్మెంట్ కేంద్రాలను నిర్వహిస్తున్న కేసులను ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. అనేక మంది ముస్లిమేతర మహిళలను మతంమార్చి ఉగ్రదళాల్లోకి పంపారు.
విజయన్ అనే మిలిటరీ అధికారి 2016లో తన కుమార్తె అపర్ణను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని వాపోయారు. అప్పుడే కేరళ మహిళలను మతమార్పిడి ద్వారా ఐసిస్ రిక్రూట్ చేసుకుంటుందనే విషయం తెలిసింది. మలప్పురానికి చెందిన అపర్ణ , సుమయ్య అని మరో యువతితో కోర్టుకు హాజరైంది..తాను ఇస్లాంలోకి మారానని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడం ఇష్టం లేదని కోర్టుకు, అక్కడి అధికారులకు తెలిపింది. బీటెక్ చదువుతున్న సమయంలో మలప్పురానికి చెందిన ఆటోడ్రైవర్ ఆషిక్ ను వివాహం చేసుకుని మతం మారింది అపర్ణ.
అలాంటి అపర్ణలు వేలమంది. పీఎఫ్ఐ సభ్యురాలైన సైనాబా ద్వారా అతిర, అఖిర అనే మరో ఇద్దరు హిందూ బాలికలు మతం మారి ఐసిస్ లో చేరారని ఎన్ఐఏ 2017లో గుర్తించింది. అలా మతం మారిన వారంతా మలప్పురంలోని మర్కజుల్ హిదాయాలేదా సత్యసరణి ట్రస్ట్ తో సంబంధం ఉన్నవారని తేలింది. దేశాన్ని ఇస్లామిక్ రాజ్యం చేయడమే తమ ప్రధాన లక్ష్యం అన్నది వారన్నమాటనే.
మలప్పురంలోని సత్యసరణి ట్రస్ట్, దీనిని మర్కజుల్ హిదాయా అని కూడా పిలుస్తారు. విద్యాసంస్థ ముసుగులో మతమార్పిళ్లకు పాల్పడుతున్న సంస్థ ఇది. లా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో 70 మంది హిందూ, క్రిస్టియన్ బాలికల మతమార్పిడి రికార్డులు దొరికాయి ట్రస్ట్ కార్యాలయంలో.
పీఎఫ్ఐ అనేక సంస్థల్లో సత్యసరణి ఒక్కటి మాత్రమే. అలాంటివి కేరళలో అనేకం. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండర్ జాకీర్ నాయక్ సాహిత్యమే వీరికి మూలం. మతం మారిన యువతీయువకులంతా నాయక్ ప్రసంగాలకు ఆకర్షితులైనవాళ్లే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2011- 2015 మధ్య రాష్ట్రంలో 5,975 మంది వ్యక్తులు ఇస్లాంలోకి మారారు. 2015లో 1,410 మంది మారారు. కొత్తగా మారిన వారిలో 35 ఏళ్లలోపు మహిళలు 76 శాతం మంది ఉన్నారు.
ఇదేదో ఊహాత్మక కథనంతో తీసిన సినిమా కాదు. ఈ సమస్య ఎంత ప్రమాదమో సాక్షాత్తూ కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం సీనియర్ నేత అచ్యుతానందన్ 2010లోనే ఒక మీటింగ్ లో ఈ #లవ్జిహాద్ గురించి హెచ్చరించాడు. ఈ మధ్య కాలం లోనే ప్రస్తుత కకేరళ సిపిఎం కూడా రాష్ట్రంలో కొన్ని శక్తులు ఆడవారిని ఉగ్రవాదులుగా మారుస్తున్నారు అని ఆరోపిస్తూ కేరళలోని ఆడపిల్లలను హెచ్చరించింది. అంతే కాదు, కేరళ చర్చ్ కూడా #లవ్జీహాద్ ద్వారా మత మార్పిడి మరియు ఉగ్రవాద కోణం పై క్రిష్టియన్ ఆడపిల్లలను హెచ్చరించింది
కేరళ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు ఈ విషయం పై మాట్లాడుతూ వేరే మతాల ఆడపిల్లలకు ఇసిస్ దగ్గర డిమాండ్ ఎక్కువగా వుండడానికి రెండు ముఖ్య కారణాలను చెప్పాడు.
1. కొత్తగా మతం మారిన వాళ్ళల్లో తీవ్ర మతతత్వ మానసికత ఎక్కువుగా వుంటుంది, వీరికి ఇస్లాం గురించి పెద్దగా పరిచయం వుండదు కాబట్టి వారిని బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదులుగా మార్చడం ఇసిస్ వారికి సులువు.
2. స్త్రీలు అయితే వారిని సెక్స్ బానిసలుగా చేసి, పిల్లలను కనే యంత్రలుగా మార్చి వారి ద్వారా ఐసిస్ సభ్యుల సంఖ్య పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది అని చెప్పాడు.
“అందుకే ఇక్కడ ఇతర మతాల ఆడపిల్లలను మతం మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కొత్తగా మతం మారడం వల్ల అందరినీ ఆకట్టుకోవాలనే అత్రం కొత్తగా మతం మారిన అమ్మాయిలకు వుంటుంది. అందుకని వారు చెప్పిన పనులును ఆలోచించకుండా చేసేస్తారు, ఒక సారి పూర్తిగా ములిగిపోయాక ఇక ఆ ఊబి నుండి బయటకు రావడం కష్టం అని కొందరు అమ్మాయిలను విచారించినపుడు బయట పడింది”. అని అధికారి చెప్పారు
అదీ కాక, ఒక సారి మతం మారి ఇళ్ళల్లోంచి బయటకు వచ్చిన ఆడపిల్లలు సహజంగా కుటుంబ, సంఘ బహిష్కరణకు గురి అవుతారు, అందుకే వారికి తిరిగి వెనక్కి వెళ్ళే దారులు ఉండవు కాబట్టి, శాశ్వతంగా తమ దగ్గర బానిసలుగా వుంటారు అని ఇతర మతాల ఆడపిల్లలు ఈ టార్గెట్ కి గురి అవుతున్నారు.
ఈ లవ్_జీహాద్ సమస్య ఒక కేరళ రాష్ట్రానికే పరిమితం కాదు. దేశ వ్యాప్తంగా తరుచుగా పలు కేసులు వింటున్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల నుండి ఎక్కువ వార్తలు స్థానిక పేపర్లలో వస్తున్నాయి.
రాడికల్ ఇస్లాం కేరళలో లోతుగా పాతుకుపోయింది. జాతీయ మీడియాఎందుకో దృష్టి సారించడం లేదు. అందుకే దేశవ్యాప్తంగా ఈ సమస్యపై చర్చ జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగాపరిగణించాలి. ఈ సమస్యకు సరైన పరిష్కారమార్గాలు రూపొందించాలి. ఇక ఇప్పుడు ది కేరళ స్టోరీ సినిమా రాబోతోంది. టీజర్ బయటకొచ్చిందో లేదో చర్చైతే మొదలైంది.కేరళతో పాటుదేశవ్యాప్తంగా కూడా, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో. “ది కేరళ స్టోరీ” సినిమా విడుదల తరువాత అయినా ప్రభుత్వాలు, స్వయంప్రకటిత ఉదార హిందూ మేధావులు ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకుంటారు అని ఆశిద్దాం.