కాంగ్రెస్ నాయకుల అవినీతి బాగోతానికి ఇది ఒక ఉదాహరణ. పార్లమెంట్ ఎన్నికలు దశల వారీగా జరుగుతున్న సమయంలో, జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక విచిత్రం బయటపడింది.
ఝార్ఖండ్ కాంగ్రెస్ మంత్రి అలంగీర్ అలం దగ్గర పనిమనిషిగా ఉండే జహంగీర్ అలం ఇంట్లో సోదాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ అధికారులు సోదాలు చేసినప్పుడు.. ఆయన ఇంట్లో 32 కోట్ల రూపాయలు కట్టలు కట్టలుగా కట్టేసిన డబ్బు బయటపడింది . నెలకు 15000 జీతం తీసుకునే ఒక పనిమనిషి ఇంట్లో .. కోట్లాది డబ్బు బయట పడేసరికి అధికారులకు కళ్ళు తిరిగినంత పని అయింది. ఆ డబ్బులు లెక్కించటానికి బ్యాంకు నుంచి కౌంటింగ్ మిషన్లో తెప్పించాల్సి వచ్చింది.
వాస్తవానికి ఒక ఏడాది క్రితం ఝార్ఖండ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో పెద్ద స్కాములు జరిగాయని సమాచారం అందింది. అప్పటి చీఫ్ ఇంజనీరు వీరేంద్ర కుమార్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మొత్తం స్కామ్ లో వందల కోట్ల రూపాయలు చేతులు మారి ఉంటాయని అంచనా వేసి, దీని మీద లోతుగా దర్యాప్తు జరిపేందుకు జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఈడి నుంచి లేఖ వెళ్ళింది. అయితే జార్ఖండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదు. దీంతో ఈడీ అధికారులు హవాలా డబ్బు లావాదేవీలకు సంబంధించి మాత్రమే దర్యాప్తు చేపట్టారు. కాంగ్రెస్ నేతలు రాంచీలో వివిధ ప్రాంతాల్లో కోట్ల కొద్ది డబ్బులు నిలువ చేశారని గుర్తించి సోదాలు చేపట్టారు. రాష్ట్ర మంత్రి అలం గీర్ అలం సన్నిహితుల దగ్గర డబ్బు పోగు పడిందని గుర్తించారు. ఇందులో తీగలాగితే డొంకంతా కదిలింది.
కాగా, . కాంగ్రెస్ ఆర్జెడి సంయుక్తంగా ఝార్ఖండ్ రాష్ట్రాన్ని నిలువునా దోచేసుకుంటున్నాయని ప్రతిపక్ష బిజెపి విమర్శలు గుప్పిస్తుంది. అయితే ఈ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని మంత్రి అలంగీర్ అలం చేతులు దులుపుకుంటున్నారు.