గంగ నుంచి విశ్వనాథాలయం వరకు నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ పనులను మోదీ ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ప్రత్యక్షంగా వేలాదిమంది పాలుపంచుకోగా…కోట్లాదిమంది వివిధ మాధ్యమాల ద్వారా తిలకించారు. దేశంలోని వివిధ మఠాలకు చెందిన 3వేల మంది సాధువులు, మత పెద్దలు, కళాకారులు, ప్రముఖులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పాల్గొన్నారు.