2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 స్థానాలు గెలుచుకుంటుదని తాను అనుకోవడం లేదని పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. 370 ఆర్టికల్ పునరుద్ధరిస్తామని పార్టీ అంటోందని కానీ పార్లమెంట్లో మెజారిటీ లేకుండా ఎలా సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ కు బలం లేనప్పుడు దాని గురించి మాట్లాడడం, తప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకనీ ప్రశ్నించారు. ఇక వ్యక్తిగతంగా తాను మాత్రం 370 గురించి మాట్లాడడం లేదని…జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని మాత్రమే కోరుతున్నాననీ అన్నారు.
“మనకు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే సంఖ్య ఉండాలి కదా…2024లో మనం అన్నిస్థానాలు గెలుచుకోలేం. అలాంటప్పుడు ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని నేనైతే అనలేను. దేవుడు మనకు 300 మంది ఎంపీలను ఇవ్వాలని కోరుకుందాం. కానీ అది జరుగుతుందని నాకు అనిపించడం లేదు. అందుకే నేను 370 గురించి మాట్లాడడం లేదు ” అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించమని మాత్రమే తాను డిమాండ్ చేస్తానన్నారు.

File Photo