నక్సల్స్ దుశ్చర్య.. జార్ఖండ్లో ఐఈడీ బ్లాస్ట్.. ముగ్గురు జవాన్లు వీరమరణం.
https://twitter.com/ANI/status/1367337260232843264
జార్ఖండ్లో నక్సల్స్ మరోసారి రెచ్చిపోయారు. వెస్ట్ సింగ్బుమ్ అటవీ ప్రాంతంలో ఐఈడీ బాంబు పేల్చడంతో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హోయత్ గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం 8.45 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. అమరులైన జవాన్లలో ముగ్గురు కూడా జార్ఖండ్ జాగ్వార్కు చెందిన వారిగా గుర్తించారు. ఇక తీవ్రగాయాలపాలైన మరో జవాన్.. సీఆర్పీఎఫ్ 197 బెటాలియన్కు చెందిన వారిగా గుర్తించారు. ఈ పేలుడు సంఘటన జరిగిన తర్వాత..వెంటనే సమీప అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఐఈడీ బాంబును అమర్చింది నక్సలైట్లేనంటూ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున కూంబింగ్ చేపడుతున్నట్లు తెలుస్తోంది.