ఆర్ఎస్ఎస్ అంతర్జాతీయ విభాగం సేవా ఇంటర్నేషనల్ ఇచ్చిన సమాచారంతో అక్కడ వారి రక్షణలో ఉన్న 298 మంది విద్యార్థులను సురక్షితంగా భారత్ చేర్చింది కేంద్ర ప్రభుత్వం. ఉక్రెయిన్ లోని పిసోచిస్ లో ఉంటున్న వారిని స్వదేశం చేర్చేందుకు పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తూ వచ్చారు స్థానిక ఏజెంట్. ఈ విషయం తెలుసుకున్న సేవా ఇంటర్నేషనల్ వాలంటీర్లు వారిని అక్కున చేర్చుకున్నారు.
వారి గురించి సమాచారం అక్కడి వాలంటీర్ మను ఖజురియాకు చేరింది. దీంతో విదేశాంగ ప్రతినిధికి సమాచారం ఇచ్చారు. పిసోచిన్లో చిక్కుకుపోయిన 298 మంది భారతీయ విద్యార్థులను స్వదేశం చేర్చినట్టు ఉక్రెయిన్లో భారత రాయబార కార్యాలయం మార్చి 5న తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బాగా నష్టపోయిన ప్రాంతాల్లో పిసోచిన్ ఒకటి. అక్కడి దాదాపు 3 వందల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని… ఆహారం నీరు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో లేవని సేవా ఇంటర్నేషన్ నుంచి ఉక్రెయిన్లోని భారత ఎంబసీకి సమాచారం అందింది. దీంతో రంగంలోకిదిగిన అధికారులు వారికి కావల్సిన ఏర్పాటు చేశారు. అదే రోజు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
https://twitter.com/IndiainUkraine/status/1499831587118190604?s=20&t=MWbgDT1IsEJ7MEbdVh-u3w
అక్కడ చిక్కుకున్న వాళ్లపైన కనీసం జాలి చూపకపోగా ఏజెంట్లు పెద్ద మొత్తం డిమాండ్ చేసినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న ఇంటర్నేషనల్ వాలంటీర్, యూకేలో ఉండే ఖజురియా వాళ్లతో మాట్లాడి ధైర్యం చెబుతూ వచ్చారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి స్థానిక ఏజెంట్లు తమతో సంప్రదింపులు జరిపారని… అక్కడి నుంచి పంపేందుకు పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారని విద్యార్థులు వాపోయారు. సరిహద్దులు దాటించేందుకే బస్సులో సీటుకు 2 వందల డాలర్ల నుంచి 5 వందల డాలర్లు వసూలు చేశారు. డబ్బులున్న వాళ్లు వాళ్లడిగిన మొత్తం చెల్లించి వెళ్లగా మిగిలన వారు అక్కడే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు.
https://twitter.com/IndiainUkraine/status/1500025848270925829?s=20&t=jsZA-OIe_ihPowZY7Ow2SA
విషయం తెలిసిన వెంటనే ఖజూరియా ఉక్రెయిన్ లోని భారత ఎంబసీని సంప్రదించారు. గ్రౌండ్లో విద్యార్థుల తరలింపులో ఉన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులకూ, ఇతర రెస్క్యూ టీంకు సమాచారం ఇచ్చారు. నిమిషాల్లో వారి నుంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్లు కోరిన వివరాలు అందించారు ఖజూరియా. జనరల్ వీకే సింగ్ కూ వివరాలు ఫార్వర్డ్ చేశారు. దీంతో కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలోని నాలుగు బృందాలు ఆ పిల్లల్ని తరలించే ఏర్పాట్లు చేసేశాయి.
కొన్నిరోజులుగా ఆ విద్యార్థులు దయనీయ స్థితిలో ఉన్నారు. సరైన తిండీ, నీళ్లు లేక నీరసించిపోయి కనిపించారు. విషయం తెలుసుకున్న వెంటనే వారికి ఆహారం అందించే ఏర్పాట్లు చేసింది సేవా ఇంటర్నేషనల్.
మార్చి 5 ఉదయం 1 గంటలకు, ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం విద్యార్థులకు ఆహారం , నీరు అందించారు ఎంబసీ ప్రతినిధులు. ఆ వెంటనే అంటే గంటలోపే అక్కడి నుంచి పిల్లల్ని తీసుకువచ్చేందుకు మూడు బస్సులను పంపారు. అక్కడి నుంచి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాన్ని భద్రంగా చేర్చారు. అలా మొత్తం 298 మంది విద్యార్థులను సేవా ఇంటర్నేషనల్ చొరవతో కాపాడింది కేంద్రం.
https://twitter.com/IndiainUkraine/status/1500086504856641543?s=20&t=q3IGQPgCm4d5tAdCXT2KCQ
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారత పౌరుల కోసం ఆపరేషన్ గంగాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దాదాపు 15 వేల మంది భారతీయులను భారత్ తీసుకువచ్చినట్టు తెలిసింది. అందుకోసం నలుగురు కేంద్రమంత్రులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు విద్యార్థులతో పాటు మొత్తం 21 వేలమందికిపైగా ఉక్రెయిన్ ను వీడి భారత్ వచ్చినట్టు సమాచారం. మిగిలిన వాళ్లందర్నీ రెండు రోజుల్లో తీసుకురానున్నారు. అటు భారతీయుల తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు ప్రశంసించిన సంగతి తెలిసిందే.
https://twitter.com/IndiainUkraine/status/1500115879454986241?s=20&t=Aw0MU2B815XPOUsDjteWgQ
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)