మన దేశానికి చెందిన అరుదైన, అమూల్యమైన పురాతన వస్తువులు మరికొన్ని తిరిగి స్వదేశం చేరాయి. ఆస్ట్రేలియా నుంచి ఏకంగా 29 పురాతన విగ్రహాలు భారత్ చేరాయి. ఆ దేశ ప్రధాని మారిసన్ తో మోదీ వర్చువల్ సమావేశానికి కాస్త ముందుగా ఈ అపురూప కళాఖండాలు మనకు అందాయి. శివుడు, ఇతర గణాధిపతులు, శక్తి, విష్ణువు, విష్ణువు వివిధ రూపాలు, జైన సంప్రదాయపు మరికొన్ని విగ్రహాలు, ఇతర అలంకారిక కళారూపాలు వీటిలో ఉన్నాయి.
ఇవన్నీ కూడా 9, 10 వ శతాబ్దాలకు సంబందించినవి. ఆస్ట్రేలియా నుంచి మనకు తిరిగి వచ్చిన ఈ వస్తు సంపదలో శిల్పాలతో పాటు పెయింటింగ్ లున్నాయి. ఇసుకరాయి, పాలరాయి సహా… కంచు, ఇత్తడి లోహాల విగ్రహాలు కూడా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ , రాజస్థాన్తో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవని తెలుస్తోంది. తిరిగి స్వదేశం చేరిన వాటిని మోదీ స్వయంగా పరిశీలించారు. మోదీ యూట్యూబ్ ఖాతాలో వీటి వివరాలను అప్లోడ్ చేశారు. ఆ పురాతన వస్తు సంపదను అందులో చూడవచ్చు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)