ఈనెల 27న ప్రధాని మోదీ పరీక్షాపే చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆరో ఎడిషన్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో మోదీ ముచ్చటిస్తారు. న్యూడిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీతో మాట్లాడేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు. గతేడాదితో పోలిస్తేఈసారి చాయ్ పే చర్చాకు రెట్టింపు రిజిస్ట్రేషన్లు వచ్చాయి.
స్టేట్ బోర్డులు, సీబీఎస్ఈ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్, నవోదయ విద్యాలయాల సమితి సహా ఇతర బోర్డులకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈసారి మొత్తం 31 లక్షలమంది విద్యార్థులు, 5 లక్షలమంది ఉపాధ్యాయులు, 2 లక్షల మంది తల్లిదండ్రులు నమోదు చేసుకున్నారని పీఎంవో తెలిపింది. ఇంకా విదేశాలలో ఉంటున్న వాళ్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. నూట యాభై దేశాలనుంచి విద్యార్థులు, 51 దేశాల నుంచి ఉపాధ్యాయులు మరియు 50 దేశాల నుంచి తల్లిదండ్రులు కూడా ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకున్నారు. 2022 నవంబర్ 25 డిసెంబర్ మధ్య వివిధ అంశాలపై ఆన్ లైన్ ద్వారా సృజనాత్మక రచనల పోటీ నిర్వహించి చర్చలో పాల్గొనేవారిని ఎంపిక చేశారు.