ఏప్రిల్ 18న మధ్యప్రదేశ్లోని భోపాల్లో ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా జరిగిన సంభాషణలో ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త కేకే మహ్మద్ మాట్లాడుతూ, ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో ఖువ్వత్-ఉల్-ఇస్లాం మసీదును నిర్మించడానికి 27 దేవాలయాలను కూల్చివేశారని అన్నారు. “కుతుబ్ మినార్ సమీపంలో గణేశుడి దేవాలయం, అలాగే ఇతర దేవాలయాల కట్టడాల శిథిలాలు కనుగొనబడ్డాయని, దీని ద్వారా అక్కడ దేవాలయాలు ఉండేవని తెలుస్తోందని అన్నారు.
ముఖ్యంగా ఢిల్లీ టూరిజం వెబ్సైట్, 73 మీటర్ల ఎత్తైన కుతుబ్ మినార్ను 27 హిందూ, జైన దేవాలయాల నుంచి పొందిన వస్తువులను ఉపయోగించి నిర్మించినట్లు స్పష్టంగా పేర్కొంది. ఢిల్లీ మొదటి ముస్లిం పాలకుడు కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ ఢిల్లీ చివరి హిందూ రాజు పృథివీరాజ్ చౌహాన్ను ఓడించాడు. తూర్పు ద్వారంపై ఉన్న ఒక శాసనం రెచ్చగొట్టే విధంగా ఇది ’27 హిందూ దేవాలయాలను కూల్చివేయడం ద్వారా పొందిన వస్తువులతో నిర్మించబడిందని తెలియజేస్తుంది”అని వెబ్సైట్ లో సమాచారం ఉంది.
అయితే ఇది స్వచ్ఛమైన ఇస్లామిక్ నిర్మాణమని కేకే మహ్మద్ తెలిపారు. గజ్నీ, ఘౌరీ సహా ఇతర మొఘల్ పాలకుల కాలంలో ఇలాంటి మినార్లు నిర్మించబడ్డాయని ఆయన చెప్పారు.
మీడియాతో మాట్లాడుతూ మధ్యయుగ కాలంలో ఇలాంటి చాలా తప్పులు జరిగాయన్నారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణాలకు సంబంధించి రెండు కమ్యూనిటీలకు బాధ్యత ఉందన్నారు. “కమ్యూనిస్ట్ చరిత్రకారులు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే వారు వాస్తవాలను దాచడానికి ప్రయత్నిస్తారు. దేవాలయాలను కూల్చివేయడం వాస్తవం, నిజాన్ని దాచిపెట్టడం వల్ల ప్రయోజనం లేదు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణంలో జాప్యం చేసిన ముస్లింలను రెచ్చగొట్టడానికి కమ్యూనిస్టు చరిత్రకారులే కారణం” అని ఆయన ఆరోపించారు.
“ప్రధాన మసీదు లోపలి, బయటి ప్రాంగణంలో షాఫ్ట్లతో అలంకరించబడి చుట్టూ పిల్లర్ ఉంటుంది. ఈ షాఫ్ట్లలో ఎక్కువ భాగం 27 హిందూ దేవాలయాలకు చెందిన శిథిలాలను మసీదు నిర్మించడానికి దోచుకున్నారు. అందువల్ల ముస్లిం మసీదుకు విలక్షణమైన హిందూ అలంకారాలు ఉండటంలో ఆశ్చర్యం లేదు” అని వెబ్ సైట్ లో ఉంది.
కుతుబ్ మినార్ నిర్మాణాన్ని క్రీ.శ.1200లో ఐబాక్ ప్రారంభించాడు. అయినప్పటికీ అతను బేస్మెంట్ ను మాత్రమే పూర్తి చేయగలిగాడు. అతని వారసుడు ఇల్తుట్ముష్ నిర్మాణానికి మరిన్ని అంతస్తులను నిర్మించాడు. తరువాత 1368లో, ఫిరోజ్ షా తుగ్లక్ భవనం చివరి అంతస్తును నిర్మించాడు.
కేకే మహ్మద్ మాట్లాడుతూ, “ఒకటి కాదు, ఆ స్థలంలో చాలా వినాయకుడి విగ్రహాలు కనిపించాయి. ఇది చుహాన్ల రాజధాని. దాదాపు 27 హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఈ దేవాలయాల శిథిలాలను ఉపయోగించి ఖువాత్-ఉల్-ఇస్లాం మసీదు నిర్మించబడింది. ఆ స్థలంలో మసీదు నిర్మించేందుకు 27 దేవాలయాలను ధ్వంసం చేసినట్లు అరబిక్ శాసనాల ద్వారా మీరు అక్కడ స్పష్టంగా ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు” అని అన్నారు.