గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో గుజరాత్లోని కచ్ జిల్లాలోని కాండ్లా ఓడరేవు వద్ద ఒక కంటైనర్ నుంచి హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు ₹1,300 కోట్లు ఉంటుందని.. 260 కిలోల హెరాయిన్ను స్వాదీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇరాన్లోని ఓడరేవు ద్వారా దేశంలోకి హెరాయిన్ను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు హుటాహుటిన దాడి చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)