డిల్లీ లిక్కర్ పాలసీ స్కీమ్ కేసుకు సంబంధించి కోర్టులో హాజరవుతున్న న్యాయవాదులకు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 25 కోట్ల 25 లక్షలు చెల్లించింది. కేసు కోసం గత 18 నెలల్లో ఢిల్లీ ప్రభుత్వం 28.10 కోట్లు ఖర్చు చేసిందని తెలిసింది. ఆప్ నేతల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ ఒక్కరే దాదాపు 19 కోట్లు తీసుకున్నారు. సత్యేంద్ర జైన్ కేసులకు హాజరైన రాహుల్ మెహ్రా ఐదున్నర కోట్లు తీసుకున్నారు.
2021-22లో సింఘ్వీ రూ. 14.85 కోట్లు, తర్వాత మరో రూ. 4.1 కోట్లు తీసుకున్నారు. 2020-21లో మెహ్రా రూ. 2.4 లక్షలు మాత్రమే అందుకోగా, 2021-22లో రూ. 3.9 కోట్లు అందుకున్నారు. 2021-22లో మద్యం కుంభకోణం కేసులో వాదిస్తున్న న్యాయవాదులు రూ.16.09 కోట్లు అందుకున్నారు. 2022-23 ఎనిమిది నెలల్లో రూ. 5.24 కోట్లు వచ్చాయి.