28 బ్యాంకులకు దాదాపు 23 వేల కోట్లు ఎగవేసి మోసం చేసిన షిప్పింగ్ కంపెనీపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ABG గ్రూప్ నకు చెందిన ABG షిప్యార్డ్ ….గుజరాత్లోని సూరత్ ,దహేజ్లలో నౌకానిర్మాణం, మరమ్మతులు చేస్తుంది. అయితే సంస్థ నిర్వహణ కోసం 28 బ్యాంకుల నుంచి 23 వేల కోట్ల రుణం తీసుకుని ఎగవేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదుతో భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ మోసం కేసుగా పరిగణలోకి తీసుకున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏసీబీ కేసులు బుక్ చేసింది.
28 బ్యాంకులు, ఆర్థిక సంస్థల కన్సార్టియమ్ను 22,842 కోట్ల మేరకు మోసం చేశారంటూ… ABG షిప్యార్డ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రిషి కమలేష్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతానం ముత్తస్వామి , మరో ముగ్గురు డైరెక్టర్లు – అశ్విని కుమార్, సుశీల్ కుమార్ అగర్వాల్,రవి విమల్ నెవెటియా పైనా ఫిబ్రవరి 7 న ఫెడరల్ యాంటీ కరప్షన్ ఏజెన్సీ కేసులు పెట్టింది.
ICICI బ్యాంక్కి 7,089 కోట్లు, IDBI బ్యాంక్కి 3,639 కోట్లు, స్టేట్ బ్యాంక్కి 2,925 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకి 1,614 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్తో పాటు ఇతరులకు ₹1,244 కోట్లను సంస్థఎగ్గొట్టిందని సీబీఐ తెలిపింది.
కంపెనీ గత 16 ఏళ్లలో విదేశీ కస్టమర్ల కోసం 46 సహా 165 నౌకలను నిర్మించినట్లు తెలిసింది. ఇక కేసులు నమోదైన దగ్గర్నుంచీ కంపెనీ వెబ్ సైట్ పనిచేయడం లేదు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)