కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ 2023-24 ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు..ప్రాధాన్యతలు కేటాయింపులు ఇవీ
- ఈ-కోర్టుల ప్రాజెక్ట్కు రూ.7వేల కోట్లు కేటాయింపు.
- 5జీ వినియోగానికి అవసరమైన యాప్స్ రూపొందించేందుకు 100 ల్యాబ్స్ ఏర్పాటు..
- నేషనల్ డేటా గవర్నెన్స్ ద్వారా సులభతర కేవైసీ.
- వ్యాపార సంస్థలకు ఇకపై పాన్ కార్డు ద్వారానే గుర్తింపు.
- నేషనల్ డేటా గవర్నెన్స్ ద్వారా సులభతర కేవైసీ.
- ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం.
- నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్కు రూ.19,700 కోట్లు కేటాయింపు.
- విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్లు కేటాయింపు.
- దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్పోర్టులు, హెలిప్యాడ్ల నిర్మాణం.
- కొవిడ్ సమయంలో నష్టపోయిన MSMEలకు రిఫండ్ పథకం.
- రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు
- వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయింపు
- బడ్జెట్లో మూలధన వ్యయానికి రూ.10లక్షల కోట్లు కేటాయింపు
- రూ.75వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన
- రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు
- కొవిడ్ సమయంలో నష్టపోయిన MSMEలకు రిఫండ్ పథకం.
- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మరింత ప్రోత్సాహం
- గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యం
- దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలతో పాటు 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు
- మహిళా సాధికారత దిశగా భారత్ కృషి
- హరిత ఇంధనం కోసం ప్రత్యేక చర్యలు
- బడ్జెట్ ప్రభావంతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు
- 250 పాయింట్లకు పైగా లాభాల్లో నిఫ్టీ
- వెయ్యిపాయింట్ల లాభాల్లో సెన్సెక్స్
- అత్యధికంగా రక్షణకు-డిఫెన్స్ కు రూ.5.94లక్షలకోట్ల కేటాయింపులు
- మధ్యతరగతి వేతన జీవులకు ఊరట.. రూ. 7 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు