శ్రద్ధా వాకర్ హత్యకేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. శ్రద్ధను చంపి ఎవరూ గుర్తించకుండా ఉండడానికి ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన ఆఫ్తాబ్ అంతకుముందు ఆమె ముఖాన్ని తగులబెట్టినట్టు అంగీకరించాడు.
ఇక శ్రద్ధ హత్యకు సంబంధించి ఇన్ని విషయాలు వెలుగుచూసినా కేసులో ఆధారాలు ముఖ్యం.
హత్య జరిగి ఆరునెలలు కావస్తుండడంతో ఆధారాల సేకరణ కష్టం కానుంది. అయితే శ్రద్ధ గురైన నెల తరువాత జూన్ లో తూర్పుడిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్న కొన్ని మానవశరీరభాగాలతో పాటు తలకూడా ఉంది. ఆ శరీర భాగాల డీఎన్ఐ నమూనా కోసం సౌత్ డిల్లీ పోలీసులు… ఈస్ట్ డిల్లీ పోలీసులను సంప్రదించారు. పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రియోక్పురి ప్రాంతంలో వారికి నరికిన తల దొరికింది.
అయితే ఆ శరీర భాగాలు ఎక్కడెక్కడో ఉండడంతో వాటిని గుర్తించడం కష్టం కావచ్చు. ఎక్కువ భాగాలను మెహ్రాలీ అటవీప్రాంతంలోనే వేసినట్టూ తెలిపాడు అఫ్తాబ్. ఆ భాగాలను ఫోరెన్సిక్ లాబ్ కు పంపామని…త్వరలోనే రిపోర్ట్ వస్తుందని పోలీసులంటున్నారు. ఇక మెహ్రాలీలో దొరికిన ఎముకలను కూడా డీఎన్ఏ పరీక్షకు పంపారు. రెండు ప్రదేశాల్లో దొరికిన శరీర భాగాల నివేదిక సరిపోలితే అప్పుడు అవి ఒక్కరివేనా…అవి కూడా శ్రద్ధవేనా అనేది నిర్ధారించడానికి అవుతుంది.
ఇక విచారణలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. అమీన్ ఆఫ్తాబ్, శ్రద్ధ నివసించిన ఫ్లాట్ కు సంబంధించి వాటర్ బిల్లును సేకరించారు పోలీసులు. ఆ బిల్లుపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిఇంటికి ప్రతినెలా 20 వేల లీటర్ల ఉచిత నీరు ఇస్తుంది. అయితే ఆ పరిమితిని దాటి అఫ్తబ్ వినియోగించినట్టు తేలింది.
ఆ ఫ్లాట్ కు సంబంధించిన వాటర్ బిల్లు 300 రూపాయలు బకాయి ఉంది. మిగతా అన్ని ఫ్లాట్లల్లో బిల్లే రాలేదు. రక్తపు మరకలు శుభ్రం చేయడానికి అతను పెద్దమొత్తంలో నీరు వాడి ఉండవచ్చని చెబుతున్నారు. అదీ కాక మృతదేహాన్ని బాత్రూల్ లోనే కోసి ఉంటాడని.. ఆశబ్దం రాకుండా ట్యాప్ లు ఆన్ చేసి ఉండవచ్చని…శరీరాన్ని భాగాలుగా కోస్తూ అక్కడే శుభ్రం చేసి మూటలు కట్టి ఉండవచ్చంటున్నారు.
ఇంకా అనేక విషయాలు వెల్లడించాడు విచారణలో ఆఫ్తాబ్. ముంబై నుంచి ఢిల్లీకి మకాం మార్చే క్రమంలో మొదట్లో ఢిల్లీలోనే బసచేశామని విచారణలో తెలిపాడు. తరువాత అపార్ట్ మెంట్ అద్దెకి తీసుకున్నారు. ముంబైనుంచి సామాను డిల్లీకి తెచ్చేవిషయంలో ఇతర ఖర్చుల విషయంలో కూడా గొడవలుపడ్డట్టు తెలిపారు. తదుపరి దర్యాప్తు కోసం మరికొంత సమయం కోరుతూ ఆఫ్తాబ్ ను సాకేత్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.