నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ సభ తొక్కిసలాట సందర్భంగా 8మంది మృతి చెందిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనతో తీవ్రంగా కలత చెందానని మోదీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతితెలిపిన ఆయన..గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు అందిస్తామని మోదీతెలిపారు. చంద్రబాబు ‘ఇదేంఖర్మ రాష్ట్రానికి” సభకు పెద్దఎత్తున జనం పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి 8మంది చనిపోయారు. అటు కందుకూరు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50వేల చొప్పున రాష్ట్రప్రభుత్వం కూడా ప్రకటించింది. అటు చనిపోయిన పార్టీ కార్యకర్తలు ఎనిమిదిమందికీ ఒక్కొక్కరికీ 15లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించింది తెలుగుదేశం పార్టీ.