నూపుర్ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనకు దిగినసంగతి తెలిసింది.అయితే పలుచోట్ల ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఆందోళనకారులు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు చనిపోయారు.ఒక్కసారిగా దూసుకొచ్చిన అల్లరిమూక పోలీసులపైకి రాళ్లురువ్వింది. దీంతో వాళ్లు బాష్పవాయుగోళాలు ప్రయోగించాల్సివచ్చింది. ఆ తోపులాటలో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు.