1993 బాంబే వరుస పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈరోజు అరెస్టు చేసింది. 1993, మార్చి 12న ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో 257 మంది మరణించగా.. 700 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, యాకూబ్ మెమన్ కుటుంబీకులే ఈ దాడికి ప్రధాన సూత్రధారులని తేలింది. మూడు దశాబ్దాలుగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు.కొందరికి శిక్ష ఖరారు చేశారు. దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ ఆ జాబితాలోని వారే. కానీ ఇంకా వారిని పట్టుకోలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో భారత భద్రతా సంస్థలు అబూ బకర్ను పట్టుకున్నాయి.
1993 పేలుళ్ల వెనుక ప్రధాన కుట్రదారులలో దావూద్ సన్నిహితుడు ఒకరిపై 1997లో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు. 2013లో యాకూబ్ మెమన్కు మరణశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తన తీర్పును సమర్థించింది. అలాగే 10 మందిపై గతంలో విధించిన మరణశిక్షలను జీవిత ఖైదుగా మార్చింది.
శిక్షణ ఇవ్వడం,నిధులు అందచేయడంతో తోపాటు బాంబు దాడులకు ఉపయోగించిన వాహనాలను కొనుగోలు చేసింది మెమనే అని తేలింది. సెప్టెంబర్ 2017లో ప్రత్యేక TADA కోర్టు ఆరుగురు దోషులకు శిక్షను ఖరారు చేసింది.
కరీముల్లా షేక్, అబూ సలేంలకు జీవిత ఖైదు, రియాజ్ అహ్మద్ సిద్ధిఖీకు 10 సంవత్సరాల జైలు శిక్ష.. తాహిర్ మర్చంట్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్లకు మరణశిక్ష విధించారు. అబ్దుల్ ఖయూమ్ నిర్దోషిగా బయటపడ్డాడు.