దేశంలో ఇప్పటి వరకు 194 కోట్ల 90 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. నిన్న 13 లక్షల 15 వేలకు పైగా వ్యాక్సిన్ డోసులు అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 12-14 ఏళ్లలోపు పిల్లలకు ఇప్పటి వరకు ఐదు కోట్ల 41 లక్షల వ్యాక్సిన్ డోస్లను అందించినట్లు తెలిపింది. హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ సహా 18 ఏళ్లు పైబడిన వ్యక్తులతో సహా గుర్తించబడిన లబ్ధిదారుల వర్గాలకు మూడు కోట్ల 84 లక్షల ప్రికాషనరీ డోసులు అందించారు.