17 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన అర్షద్ ఖాన్ సహా మరో ముగ్గురిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పిసంగంజ్ పీఎస్ పరిధిలోని ధున్వాలియాలో మార్చి 22న ఈ దారుణం జరిగింది. గ్రామ సమీపంలోని రాస్-మంగ్లియావాస్ హైవే వద్ద అడవిలో ఈ దారుణానికి తెగబడ్డా అతని గ్యాంగ్ అర్షద్. బాలికను చంపిన తరువాత ఖాన్ తనను తాను గాయపరుచుకున్నాడు. బాధితురాలు రావణ రాజ్ పూత్ కమ్యూనిటీకి చెందిన బాలిక.
ఉత్తరప్రదేశ్ హర్దోయ్ జిల్లా సురాయ్ సుల్తాన్ కు చెందిన వాడిగా గుర్తించారు. ఇన్ స్టా గ్రామ్ ద్వారా అతను బాలికను పరిచయం చేసుకున్నట్టు విచారణలో తేలింది. వాళ్లు పలుమార్లు చాటింగ్ చేసుకున్నట్టు గుర్తించారు. తనను కలవాలని అర్షద్ తరచూ ఆమెను వేడుకునేవాడు. అయితే ఆమె నిరాకరించినప్రతిసారీ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ వచ్చాడు.
ఘటన జరగిన రోజు కూడా అలాగే బెదిరించాడు. తనకోసం రాకుంటే ఇంటికే వస్తాననడంతో తల్లిదండ్రులకు భయపడిన బాలిక అతను చెప్పిన చోటుకు వెళ్లింది. వెళ్తూ తన ఫోన్ ను ఇంట్లోనే పెట్టి వెళ్లింది. ఆమెను రప్పించి…తన మరో ముగ్గురు స్నేహితులను పిలిపించాడు అర్షద్. అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసినట్టు తేలింది. తరువాత పదునైన ఆయుధంతో బాలిక గొంతుకోశాడు. ఎంతసేపటికీ తను ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి వెతకడం ప్రారంభించారు. చివరకు గ్రామశివారులో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. వంద అడుగులు దూరంలో అర్షద్ నూ పోలీసులు గుర్తించారు. అయితే కుటుంబసభ్యులు పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా పారిపోయాడు. తరువాత అజ్మీర్ రైల్వేస్టేషన్లో పట్టుబడ్డాడు. అతని స్నేహితులనూ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారు వాడిన కారును స్వాధీనం చేసుకున్నారు. విచారణ జరుగుతోందని దోషులకు కచ్చితంగా శిక్షపడుతుందని పోలీసులు తెలిపారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)