దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద దేశంలో 165 కోట్ల డోస్ల కోవిడ్ వ్యాక్సిన్లను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 24 గంటల్లో 56 లక్షల 72 వేలకు పైగా కోవిడ్ టీకాలువేశారు. జాతీయ రికవరీ రేటు 93.89 శాతంగా ఉందని, దేశంలో ఇప్పటివరకు మూడు కోట్ల 83 లక్షల మంది రోగులు కోవిడ్-19 నుండి కోలుకున్నారని వెల్లడించింది.
ఇప్పటివరకు 72 కోట్ల 57 లక్షలకు పైగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. “ప్రధాని నరేంద్ర మోదీ క్రియాశీలక నాయకత్వంలో కోవిడ్ 19 కి వ్యతిరేకంగా దేశం సమిష్టి పోరాటంచేస్తోందని..ఇప్పటివరకు 165 కోట్ల వ్యాక్సిన్ డోస్లు పూర్తయ్యాయి” అని వైద్యారోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.
https://twitter.com/mansukhmandviya/status/1487270225053904897?s=20&t=gKPplsvwH9G9cLDxPkm5Bw