స్థానిక స్వామి వివేకానంద 159 వ జయంతి సందర్బంగా మర్రిగూడలోని యూత్ ఫర్ బెటర్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు పోనుగోటి దామోదర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద విగ్రహానికి గజమాలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా దామోదర్ మాట్లాడుతూ స్వామి వివేకానందని ఆదర్శగా తీసుకొని యువత సామాజిక కోణం లో పని చేయాలని పిలుపునిచ్చారు…స్వామిజి స్పూర్తితో యూత్ ఫర్ బెటర్ సొసైటీ సామాజిక దృష్టి తో సమాజం లో ఉన్న సమస్యలపైన రాజీ లేని పోరాటం చేస్తుంది అని తెలిపారు. స్పెషల్ గా పాఠశాల సమస్యల పైన పోరాటం చేయిస్తుందని తెలిపారు. యూత్ ఫర్ సొసైటీ 3 సంవత్సరాల పోరాట ఫలితంగా పాఠశాల స్థలం లో ఉన్న దహన సంస్కార వాటిక తరలింపు జరిగింది అని స్పెషల్ గా పగడల అంజి పోరాటం మరువలేనిదీ అని తెలిపారు… ఈ సంధర్బంగా అంజికి చిరు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో వెంకటంపేట అంజి, శేఖర్, బాబు రఘు, సర్పంచ్ నల్ల యాదయ్య, చెరుకు శ్రీరామ్, నర్సింహ, నవీన్, శ్రీకాంత్, వినోద్, నగేష్, విజయ్, ఎల్లేశ్, శంకర్, దశరథ, పోలె సైదులు, గ్యారా లింగం, రాజేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.