TSPSC పేపర్ లీకేజీ నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందు 9 మంది నిందితులకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తరువాత కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి అందరికీ 14 రోజుల రిమాండ్ విధించారు. వారిలో ఎనిమిదిమందిని చర్లపల్లి జైలుకు తరలించారు. A3 నిందితురాలు గా ఉన్న రేణుకను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కీలకాంశాలు వెల్లడించారు. ఏఈ , టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ప్రశ్నాపత్రాలను ప్రవీణ్ తన దగ్గరే పెట్టుకున్నాడని…ఆ నకళ్లను అతని నుంచి స్వాధీనం చేసుకున్నామని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.