స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పించే ప్రయత్నాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మత విశ్వాసాలకు , భారతదేశ ఆచార సంప్రదాయాలకు అది విరుద్ధమని ..జోక్యం చేసుకోవాలంటూ 120మంది ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖరాశారు. స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లు అసహజమన్నారు. ఇలాంటి వికృత పనులు, నిర్ణయాలను భారతీయ సమాజం ఆమోదించబోదన్నారు. భారతదేశపు మౌలిక సంప్రదాయాలు, సంస్కృతులు, ఆచారవ్యవహారాలు, మత సంబంధ అంశాలపై దాడులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రపతికి లేఖ రాసిన వారిలో మాజీ న్యాయమూర్తులు, వివిధ రంగాల్లో పనిచేసిన ఉన్నతాధికారులు ఉన్నారు.