ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో భేటీ అయిన తెలంగాణ కేబినెట్ ముఖ్యమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీ అనంతరం వివరాలు వెల్లడించారు సీఎం. ఎప్పటినుంచే చర్చలో ఉన్న 111 జీవోను ఎత్తివేస్తూ కేబినెట్ తీర్మానించింది. కొత్తగా 6 ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆమోదం తెలిపింది. సంబంధిత మంత్రులే ఈ మేరకు జీవో జారీచేస్తారని సీఎం తరువాత ప్రకటించారు. అలాగే రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 3,500 పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తున్నట్టు శుభవార్త తెలిపారు కేసీఆర్. 111 జీవో మీద నిర్ణయానికి సంబంధించి సీఎస్ నేతృత్వంలో కమిటీ వేశామని..కాలుష్యనియంత్రణ మండలి,అటవీశాఖ అధికారులను కలిపి కమిటీ వేశామని గుర్తు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న మూసీ, ఈసానదులు కలుషితం కాకుండా గ్రీన్ జోన్స్ డిక్లేర్ చేస్తూ జీవో జారీ చేసేలా ఆదేశాలు ఇచ్చామని ఆయన అన్నారు. మే 20 నుంచి జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. చెన్నూరు ఎత్తిపోతల పథకానికీ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇంకా శంషాబాద్ ఎయిర్ పోర్టులో సెకండ్ రన్ వే, ఫార్మా యూనివర్సిటీని అందుబాటులోకి తేవడం వంటివాటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్. సమైక్యపాలనలో వ్యవసాయరంగం పూర్తిగా ధ్వంసమైందన్న కేసీఆర్ వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెడతామని వ్యాఖ్యానించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)