హిందూమతంలోకి మారిన షియా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ వసీం రజ్వీని చెప్పుతో కొట్టిన వారికి 11 లక్షల రివార్డు ఇస్తానని ప్రకటించారు మొరాదాబాద్ జిల్లా ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ప్రెసిడెంట్ వాకీ రషీద్.
రిజ్వీ హిందూ, ముస్లింల మధ్య చీలిక తెస్తున్నారని…అతన్ని చెప్పుతో కొట్టిన వాళ్లకు బహుమతి ఇస్తాను. అలాంటి సంఘవ్యతిరేక శక్తులను సమాజం నుంచి వెలేయాలని ఆయన అన్నారు. రిజ్వీపై పలు ప్రాంతాల్లో ఎఫ్ఆర్ఐలు నమోదైనా అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటే దేశంలో మతసామరస్యం ఉంటుందా అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వ ఆదేశానుసారమే హిందూ-ముస్లిం ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ‘కుట్ర’ చేస్తున్నారని మండిపడ్డారు. ఇక వసీం రిజ్వీ తల తెచ్చిస్తే…50 లక్షల నజరానా ఇస్తానని హైదరాబాద్ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇటీవలే ప్రకటించారు.