తెలంగాణ పదోతరగతి ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇక ఈసారి కూడా పదోపతరగతిలో బాలికలే సత్తా చాటారు. 88.53 శాతంమంది ఉత్తీర్ణులయ్యారు. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 4,91,862 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈసారి ఫలితాల్లో 99శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్ లో నిలిచింది. 59.46 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. 2793 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 పాఠశాలల్లో 0 శాతం ఫలితాలు వచ్చాయి.
పదోతరగతి ఫలితాలు:99శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ ఫస్ట్, ఈసారీ అమ్మాయిలదే పైచేయి
తెలంగాణ పదోతరగతి ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇక ఈసారి కూడా పదోపతరగతిలో బాలికలే సత్తా చాటారు. 88.53 శాతంమంది ఉత్తీర్ణులయ్యారు. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 4,91,862 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈసారి ఫలితాల్లో 99శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్ లో నిలిచింది. 59.46 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. 2793 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 పాఠశాలల్లో 0 శాతం ఫలితాలు వచ్చాయి.