పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుపై సెషన్స్ కోర్టులోనే విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. సెషన్స్ కోర్టులోనే విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పిస్తూ..అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదంది. 2022 ఏప్రిల్లో పదోతరగతి తెలుగు ప్రశ్నాపత్రం లీకైంది. అందులో నారాయణ పాత్ర ఉన్నట్టు కేసు నమోదైంది. అయితే ఆ విద్యాసంస్థల అధినేతగా ఇప్పుడు నారాయణ లేరని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఇటీవల ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు రద్దు చేయగా ఆయన సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపైనా సుప్రీం స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వానికీ ఈమేరకు నోటీసులు జారీ చేసింది.