ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 105 సీట్లు పక్కా అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన… ఆఫలితాలను పట్టించుకోవద్దని సూచించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా 9 ఏళ్లలో ఏం చేశామో ప్రజలకు చెప్పాలని బీఆర్ఎస్ బాస్ వారికి చెప్పారు. రైతులను చెరువుల దగ్గరకు పిలిచి మీటింగ్లు పెట్టాలని, చెరువుగట్ల మీద రైతులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. మంత్రులు జిల్లాల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.
105 సీట్లు మనవే – పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ధీమా
Share: