ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. నందమూరి తారకరామారావు శతజయంత్యుత్సవాల సందర్భంగా …ఆయన చిత్రంతో వందరూపాయల వెండి నాణెం ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు ఆయన కుమార్తె పురంధేశ్వరిని కలిసిన మింట్ అధికారులు ఆమె సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఎన్టీఆర్ పేరుతో నాణెం తీసుకురావల్సిందిగా తాను ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ను కోరినట్టు పురంధేశ్వరి తెలిపారు. ఇప్పుడిక మింట్ నుంచి ఆమోదం వచ్చిందని.. అందుకు 3 ఫొటోలను వారు పరిశీలించారని వివరించారు. అయితే నాణెం ముద్రణ పూర్తై బయటకు రావడానికి నెలరోజులు పడుతుందని సమాచారం.