మనీలాండరింగ్ చట్టం(PMLA) కింద జర్నలిస్టు రాణా అయ్యూబ్ కు సంబంధించిన రూ.1.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. వ్యక్తిగత ఖర్చులు, తండ్రి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్, పబ్లిక్ ఫండ్స్ నుండి ఆమె సోదరికి బదిలీలు చేసి పలు విధాలుగా దుర్వినియోగం చేశారని ED తెలిపింది.
అటాచ్మెంట్ ఆర్డర్లో “రాణా ఆయూబ్ సాధారణ ప్రజా దాతలను ముందస్తు ప్రణాళిక ప్రకారం మోసం చేశారని” ED పేర్కొంది.
‘హిందూ ఐటీ సెల్’ వ్యవస్థాపకుడు వికాస్ సాంకృత్యాయన్ ఫిర్యాదు మేరకు ఆయూబ్పై కేసు నమోదైంది. ఆమె 2020 – 2021 మధ్య స్వచ్ఛంద సేవా ప్రయోజనాల కోసం Ketto అనే ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ద్వారా రూ. 2.69 కోట్లకు పైగా సేకరించినట్లు ఈడీ పేర్కొంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా సేవింగ్ బ్యాంకు ఖాతా నుంచి రూ.50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది.
రానా ఆయూబ్ సేకరించిన డబ్బును ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఆమె సేవింగ్ బ్యాంక్ ఖాతా, సోదరి సహా తండ్రి బ్యాంక్ ఖాతా నుంచి నిధులు బదిలీ చేసింది.
ED పేర్కొన్న కారణాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆర్డర్ జారీ చేసిన తేదీ నుంచి 180 రోజుల పాటు సేకరించిన మొత్తాన్న…, ఉపయోగించిన మొత్తాన్ని తాత్కాలికంగా జప్తు చేసింది.
(ఎ) ఏప్రిల్-మే 2020లో మురికివాడలు, రైతుల కోసం.
(బి) జూన్-సెప్టెంబర్ 2020లో అస్సాం, బీహార్ సహా మహారాష్ట్రలకు సహాయక చర్యలు,
(సి) మే-జూన్ 2021లో భారతదేశంలో కోవిడ్ 19 ప్రభావిత వ్యక్తులకు సహాయం …అంటూ రాణా డబ్బులు వసూలు చేసింది.