దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందంటూ ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తెలిసిందే. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా నిన్న లోక్సభలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై చర్చ జరుగుతున్న సమయంలో రూ. 1.6 లక్షలకు పైగా విలువైన తన లూయిస్ విట్టన్ బ్యాగ్ను దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ధరల పెరుగుదలపై మాట్లాడేందుకు లేచి నిలబడిన తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కకోలి ఘోస్ట్ దస్తిదార్ వైపు కెమెరా ఫోకస్ ఉంచగా.. ఆమె పక్కనే కూర్చున్న మహువా మొయిత్రా, సీటుపై పక్కనే పెట్టుకున్న తన లూయిస్ విట్టన్ బ్యాగ్ తీసుకుని, దాన్ని కెమెరాకు కనిపించకుండా ఆమె కాళ్ళ దగ్గర దాచిపెట్టారు.
#Watch: TMC Leader Mahua Moitra carries 1.6 Lakh worth Louis Vuitton bag to Parliament, Brinjal video spills beans@MahuaMoitra#MahuaMoitra #LouisVuitton #Bag #Brinjal #Viral #ParliamentMonsoonSession #Parliament #India #Trending #LokSabha #TMC #Politics #BREAKING pic.twitter.com/sdylmxTBI7
— Free Press Journal (@fpjindia) August 1, 2022
ద్రవ్యోల్బణంపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అత్యంత ఖరీదైన హ్యాండ్బ్యాగ్ ను పార్లమెంటుకు ఎలా తీసుకువెళుతున్నారో అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నించారు. ఫ్యాషన్ బ్లాగ్ లు, వెబ్సైట్ ల ప్రకారం, మోయిత్రా వాడుతోన్న బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ విలువ సుమారు రూ. 1.6 లక్షలు.