కరోనా సంక్షోభ సమయంలో శుభవార్త చెప్పారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్…
గతంలో రెండేళ్లపాటు మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్ల మారటోరియం కల్పిస్తున్నట్టు ప్రకటించారు.మార్చి 2022 వరకు ఎన్పీఏల కోసం నిర్దిష్ట కేటాయింపులను ప్రకటించారు. ఈ విపత్తు సమయంలో సూక్ష్మ, చిన్న ,ఇతర అసంఘటిత రంగ సంస్థలకు మరింత సహకారం అందిస్తామన్నారు. అంతేకాదు మార్చి 2022 వరకు వరకు కోవిడ్-19 సంబంధిత మౌలిక వసతుల కోసం రూ.50 వేల కోట్ల కేటాయింపు
చిన్న ఫైనాన్స్ బ్యాంకుల కోసం ప్రత్యేక దీర్ఘకాలిక రెపో కార్యకలాపాలు. ప్రస్తుత రెపో రేటుకు రూ.10,000 కోట్లు, రుణగ్రహీతకు రూ.10 లక్షల వరకు తాజా రుణాలు అందిస్తామని… అక్టోబర్ 31,2021 వరకు ఈ సదుపాయం ఉంటుందనీ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు ఓడీ ఉపశమనం. 36 రోజుల నుంచి 50 రోజులకు గడువు పెంపూ ప్రకటించారు.
కరోనా రెండో దశ ఉద్ధృతి చాలా తీవ్రంగా ఉందని, గత నెలలో పరిస్థితి తీవ్రంగా మారిందని శక్తికాంత ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో మాట్లాడిన ఆయన కరోనా నిబంధనలను, భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యాపారాలు చేయడం అలవాటు చేసుకున్నారన్నారు. తదుపరి ఏడాది ద్రవ్యోల్బణాన్ని స్థానిక లాక్డౌన్లు, కరోనా వ్యాప్తి ప్రభావితం చేస్తాయని …. ఎదుర్కొనేందుకు దేశ బ్యాకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే అన్ని వర్గాలను ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వంతు సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు.