దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
ప్రధాని మోదీకి లేఖ రాశారు. మహమ్మారి కట్టడికి పక్కా వ్యూహంతో వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని సూచించారు.
వ్యాక్సినేషన్ కోసం పంచ సూత్రాలను సూచిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కోట్లాదిమంది జీవనాధారం కోల్పోయి పేదరికంలో చిక్కుకుపోయారని.. సాధారణ స్థితి ఎప్పుడు నెలకొంటుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని ..ఈ సమయంలో తప్పనిసరిగా ఆచరించాల్సినవి కొన్ని ఉన్నాయని ముఖ్యంగా వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయడమేనని సూచిస్తూ మాజీ ప్రధాని లేఖలో పేర్కొన్నారు.